Monday, August 28, 2017

మరిచాం

మనం మైత్రిని మంచితనాన్ని మరిచాం

బ్రతికి ఉన్నాం కానీ జీవించడం మరిచాం

పరిమళం ఆస్వాధిస్తూ పూలని మరిచాం

అవసరానికి ఆదుకున్న వారిని మరిచాం

కోరికల్ని బేరసారమాడి ప్రేమను మరిచాం 

చావు భయంతో కన్న వాళ్ళని మరిచాం

ఇప్పుడు మైనం కరిగి రాయిగా మారదు 

త్యాగమంటూ ఎవరిపై ఎవరికీ దయలేదు

గమ్యం చేరాలనే ఆత్రుతలో దారి మరిచాం 

5 comments:

  1. మానవత్వపు అంచులపై అడుగులేస్తు
    పడి లేచే కెరటాలను తనివితీరా చూస్తాము
    అవి చెప్పే నీతి: మనిషిగా మరలి రాలేవు
    మానవత్వాన్ని మరువకు ఏనాడని
    చివరికి మిగిలేది జ్ఞాపకాలేనని

    తడి చినుకుల వాన నీటి లో గొడుగు పడుతూ
    నిలువెల్ల తడసి లోలోనే ఆనందిస్తాము
    అవి చెప్పే నీతి : గర్వమనేది దరికి రానివద్దని
    ఆశ ఆవిరైనా ఆనందాన్ని దోసిలి పట్టాలని
    రంగుల హరివిల్లుగా మారాలని

    ~శ్రీ

    ReplyDelete
  2. నిజమే మనిషి మానవత్వాన్ని మరిచాడు.

    ReplyDelete
  3. మనిషి రానురాను మృగంలా మారిపోతున్నాడు మంచిని మరచి.

    ReplyDelete
  4. గమ్యం చేరాలన్న ఆత్రుతలో
    దారి మరచిపోవడం బాగుంది.
    బాగా బ్రతకాలి అనుకునే అత్యాసలో
    జీవించడం మరుస్తున్నాము

    ReplyDelete
  5. మానవత్వం కరువైపోయె

    ReplyDelete